Sai Dharam Tej: 'విరూపాక్ష' ట్రైలర్‌ చూస్తుంటే భారీ స్థాయిలో వసూళ్లు ఖాయమంటున్న.. అల్లు అరవింద్‌

by Disha Web Desk 10 |
Sai Dharam Tej: విరూపాక్ష ట్రైలర్‌ చూస్తుంటే  భారీ స్థాయిలో వసూళ్లు ఖాయమంటున్న..  అల్లు అరవింద్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలన్ని ట్రైలర్‌ బావుంటే వసూళ్లు బాట పడుతున్నాయి. 'విరూపాక్ష' ట్రైలర్‌ చూస్తుంటే వసూళ్లు భారీ స్థాయిలో వసూళ్లు ఖాయం'' ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. నిన్న జరిగిన 'విరూపాక్ష' ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దిల్ రాజు, అల్లు అరవింద్‌ హాజరయ్యారు. ఈ సినిమాకు కార్తీక్‌ దండు దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త హీరోయిన్‌గా నటించింది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ట్రైలర్‌ని విడుదల చేశారు. 'జరుగుతున్న చావులకి కారణం నేను తెలుసుకుని తీరతాను', 'ఈ రుద్రవనాన్ని కాపాడగల విరూపాక్షవి నువ్వే..' అంటూ సాగే సంభాషణలు కొన్ని సినిమా పై అంచనాలను పెంచేసాయి.

ఇవి కూడా చదవండి: ధోనీ LGM చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

Next Story

Most Viewed