శ్యామ్ బాబు, రాంబాబు కాదంటూ క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్

by Disha Web Desk 7 |
శ్యామ్ బాబు, రాంబాబు కాదంటూ క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం మొత్తానికి మంచి విజయం సాధించింది. ఇక మూవీ హిట్ విషయం పక్కనపెడితే.. ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉద్దేశించి.. ఈ చిత్రంలో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ పోషించిన శ్యామ్ బాబు అనే పాత్ర పెట్టారని, కావాలనే తనను టార్గెట్ చేసి తీశారు అని రాంబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై హీరో సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ‘మా చిత్రంలో పొలిటికల్‌గా ఎవరినీ ఉద్దేశించి తీయలేదు. మా పిఆర్ టీంలో ఉండే శ్యామ్ బాబు అనే వ్యక్తి ఆధారంగా మా సినిమాలో పాత్రని పెట్టాం. అంతే తప్పా ఇంకెవరిని ఉద్దేశించి కాదు’ అని చెప్పుకొచ్చాడు.


Next Story