అపోలో ఆస్పత్రికి సద్గురు.. ఆనందంలో ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్!

by Disha Web Desk 9 |
అపోలో ఆస్పత్రికి సద్గురు.. ఆనందంలో ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు ఉపాసన ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురును ఎంతగా నమ్ముతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చరణ్-ఉపాసన పెళ్లైన 11 ఏళ్ల తర్వాత పాపకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో సంబురాలు మిన్నింటాయి. అయితే మెగా ప్రిన్సెస్‌ను చూసేందుకు సద్గురు ఆసుపత్రికి వెళ్లి.. ఆశీర్వదించారు. మెగా కుటుంబంలోకి మహాలక్ష్మి వచ్చిందంటూ మెగాస్టార్ చిరంజీవి దంపతులకు అభినందనలు తెలియజేశారు. సాక్షాత్తు సద్గురు తన బిడ్డకు దీవెనలు ఇవ్వడానికి రావడంతో ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. సద్గురుకి కృతజ్ఞతలు తెలియజేసి.. సద్గురు ఆశ్రమానికి రూ.300 కోట్ల విరాళం ఇవ్వాలని అపోలో హాస్పిటల్ ఎండీ అయిన ఉపాసన తాతయ్యకు ప్రతాప రెడ్డిని కోరింది.

ఆయన వెంటనే సద్గురుకి రూ.300 కోట్ల రూపాయల చెక్కు ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లల్ని కనడం గురించి సద్గురు ఉపాసనకు ఏం చెప్పాడంటే.. ‘‘పిల్లల్ని కనకుండా ఉండే వారందరికీ నేను అవార్డులు ఇస్తాను, ఈ తరం వారు పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. ఒకవేళ నువ్వు ఆడ పులివి అయి ఉంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు కదా. ఇప్పటికే మనం ఈ భూమి జనాభా అధిక సంఖ్యలో ఉన్నామని సద్గురు సమాధానమిచ్చారు.

Also Read..

Ram Charan: కూతురు పుట్టిన ఆనందంలో గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్!

Next Story

Most Viewed