నా పల్లెటూరి కథ ప్రపంచాన్ని మెప్పించింది.. కంగన కామెంట్స్‌పై రిషబ్

by Disha Web Desk 7 |
నా పల్లెటూరి కథ ప్రపంచాన్ని మెప్పించింది.. కంగన కామెంట్స్‌పై రిషబ్
X

దిశ, సినిమా : 'కాంతార'ను ఆస్కార్‌కు పంపించాలనే కంగనా రనౌత్ కామెంట్స్‌పై హీరో రిషబ్ శెట్టి స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేసిన ఆయన.. తనతోపాటు కన్నడ సినిమాను ప్రశంసించిన కంగనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 'ఆమె సందేశం వచ్చిన వెంటనే దానిని నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నా. ఆమెను కూడా ట్యాగ్ చేసాను. ఎక్కడో పాతుకుపోయిన ప్రాంతీయ సినిమాకి దేశ వ్యాప్తంగా ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడూ ప్రాంతీయత అనేది మరింత సార్వజనీనంగా ఉండాలని భావించేవాడిని. నేను అందించిన నా పల్లెటూరి కథ ప్రపంచంలో అందరికీ నచ్చింది. మా విశ్వాసాలు, సంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం వంటి అంశాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రైటర్‌గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది.



Next Story

Most Viewed