- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ, ముఖేష్ అంబానీలతో వేదిక పంచుకోనున్న Ram Charan ..
ప్రస్తుతం హీరో రామ్ చరణ్కు గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ విడుదల తర్వాత అతని లెవెల్ మారిపోయింది..

X
దిశ, సినిమా: ప్రస్తుతం హీరో రామ్ చరణ్కు గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ విడుదల తర్వాత అతని లెవెల్ మారిపోయింది. ఎన్డీటీవీ అవార్డుతోపాటు మరెన్నో అవార్డులు.. రివార్డులు అతని చెంత వాలుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉపాసన ప్రెగ్నెంట్ అని అధికారిక ప్రకటన వెలువడటంతో చరణ్ తండ్రి కాబోతున్నాడన్న వార్త అతని ఫ్యాన్స్కు సంతోషాన్ని కలిగించింది. అదే సమయంలో రామ్ చరణ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. అదేమిటంటే డిసెంబర్ 14న అహ్మదాబాద్లో స్వామీ మహారాజ్ జన్మదిన శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ, కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాల్లో వారితోపాటు పాల్గొనే అవకాశం చరణ్కు కూడా లభించడంతో అతని ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Also Read....
Next Story






