- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB29 కోసం జక్కన్న భారీ ప్లాన్..100 అడుగుల టవర్, రూ.20 కోట్లతో !
SSMB29 కోసం జక్కన్న భారీ ప్లాన్ రామోజీ ఫిల్మ్ సిటీలో.. వంద అడుగుల ఎత్తుతో భారీ LED టవర్ సెట్ ఏర్పాటు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ), దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 29. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు కానీ SSMB 29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మహేశ్ బాబు సినిమా కోసం భారీ సెట్ వేయిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli ). నవంబర్ 15వ తేదీన నిర్వహించబోయే పబ్లిక్ ఈవెంట్ కోసమే ఈ భారీ సెట్ ఏర్పాటు చేయిస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో.. వంద అడుగుల ఎత్తుతో భారీ LED టవర్ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, రాజమౌళి, ఇతర నటీనటులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్లో టైటిల్ ప్రకటన ఉంటుందని టాక్ నడుస్తోంది. జియో హాట్స్టార్ లో ఈ ఈవెంట్ ప్రసారం కానుంది. అయితే, ఈ ఈవెంట్ కోసం మొత్తం రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్, గెస్టులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ అనుకుంటున్నారట. క్లిక్






