అందరి ముందు రాజమౌళిని ఆ ప్రశ్న అడిగిన రిపోర్టర్.. కోపంతో జక్కన్న ఏం చేశాడంటే?

by Disha Web Desk 8 |
అందరి ముందు రాజమౌళిని ఆ ప్రశ్న అడిగిన రిపోర్టర్.. కోపంతో జక్కన్న ఏం చేశాడంటే?
X

దిశ, సినిమా : దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఏ సినిమా తీసినా అది రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈయన తన దర్శకత్వంలో ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అంతే కాకుండా చాలా మంది స్టార్ హీరోలు ఈయనతో ఒక్క సినిమా చేయాలని ఆరాటపడుతుంటారు అంటారు కొందరు. ఎందుకంటే ఆ తర్వాత ఆ నటుల రేంజ్ అనేది అంతలా పెరిగిపోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్, త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, తారక్‌ల లైఫ్ మరో విధంగా టర్నై గ్లోబల్ స్టార్స్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా బిజీలో ఉన్నాడు.

అయితే తాజాగా రాజమౌళి మరో బాహుబలితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో బాహుబలి యానిమేషన్ సిరీస్ రానుంది. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ మే 17న స్ట్రీమింగ్ కానుంది.. అందులో భాగంగా తాజాగా మీడియా కోసం రెండు ఎపిసోడ్స్ ప్రదర్శించారు. అయితే అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రాజమౌళి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే రిపోర్టర్ కొన్ని ప్రశ్నలు సంధించగా వాటికి సమాధానం ఇచ్చారు.

యానిమేషన్ సిరీస్‌తో మీరు బాహుబలి సినిమాను చెడగొట్టారు అనిపిస్తుందా అని అడగ్గా.. అది ఏం లేదు..ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే త్రిబుల్ ఆర్ సినిమాలో మీరు చరణ్‌ను ఎక్కువ చేసి చూపెట్టారని, తారక్‌ను కావాలనే తక్కువగా చూపించారంటూ విమర్శలు వచ్చాయి కదా.. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అని ప్రశ్నించగా .. దీనికి ఆన్సర్ చెప్పడానికి ఇది సరైన సందర్భం కాదు అంటూ కోపంతో వేదిక నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story