- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిల్ రాజు 63వ ప్రాజెక్ట్లోకి క్వీన్ ఎంట్రీ.. బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం
గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, క్వీన్ ఈ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో ఓక్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, దిల్ రాజు బ్యానర్లో 63వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ నేరుగా ఒక తెలుగు నిర్మాణ సంస్థలో సినిమా చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్పై అటు బాలీవుడ్, ఇటు సౌత్ ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో సల్మాన్ సరసన హీరోయిన్ ఎవరనే సస్పెన్స్కు చిత్ర యూనిట్ తాజాగా తెరదించింది. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.
‘క్వీన్ వచ్చేసింది’ అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సల్మాన్ ఖాన్కు జోడీగా నయనతార కన్ఫర్మ్ అయినట్లు తెలియజేశారు. మొదటిసారి సల్మాన్ - నయనతార వెండితెరపై జంటగా అలరించబోతుండటం విశేషం. నయనతార ఈ సినిమాలో చేరడం పట్ల దిల్ రాజు టీమ్ ఎంతో గర్వంగా ఫీలవుతోంది. "అద్భుతమైన ప్రతిభ ఉన్న నయనతార గారు మా ప్రాజెక్ట్లో భాగం కావడం మాకు లభించిన గొప్ప గౌరవం" అని మేకర్స్ ప్రశంసలు కురిపించారు. సౌత్ ఇండియాలో తిరుగులేని ఇమేజ్ ఉన్న నయనతార, బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్తో జతకట్టడం ఈ సినిమా రేంజ్ను ఎక్కడికో తీసుకెళ్లింది. వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, దిల్ రాజు మేకింగ్ వాల్యూస్ తోడైతే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






