కృష్ణంరాజు చనిపోయిన ఇన్నాళ్లకు అలాంటి పని చేయబోతున్న ప్రభాస్ పెద్దమ్మ!

by Disha Web Desk 9 |
కృష్ణంరాజు చనిపోయిన ఇన్నాళ్లకు అలాంటి పని చేయబోతున్న ప్రభాస్ పెద్దమ్మ!
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తన ప్రతిభతో, నటనతో ప్రేక్షకుల మనసులో నిలిచారు. 'సినీ ఇండస్ట్రీలో ఆయన వారసత్వం కొనసాగిస్తోన్న ప్రభాస్‌ను పరిశ్రమకు పరిచయం చేసి పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టాడు. ఇక కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నటుడు చనిపోయిన ఇన్నాళ్లకు ఈయన సతీమణి శ్యామలా దేవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

మొదటి నుంచి ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. కృష్ణ ఉన్నప్పుడు కూడా ఇంటికి సంబంధించిన విషయాలు అండ్ బిజినెస్ వ్యవహారాలు ఎక్కువగా పట్టించుకుంటూ ఉండేవారు. అయితే ఆయన చనిపోయాక ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇదే సమయంలో వారికి దగ్గర బంధువైన ఓ పొలిటిషియన్ ప్రభాస్ ఫ్యామిలీని మొత్తం ముక్కలుగా చేయాలని చూశాడు. ఈ క్రమంలో శ్యామలా దేవి రాజకీయాల్లోకి దిగినట్లు వార్తలు వినిపించాయి. అదే కాకుండా ఉన్న ఆస్తిని కూతుళ్లకు, కొడుకులకు సమాన వాటా ఇచ్చి, వారికి పెళ్లి చేసి రెస్ట్ తీసుకుందమని అనుకుంటుందట. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed