Chiranjeevi కి Pm Modi అభినందనలు

by Disha Web Desk 2 |
Chiranjeevi కి Pm Modi అభినందనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు సినీ దిగ్గజ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ప్రశంసలు, అభినందనలు తెలుపుతున్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 'చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణనూ చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు అభినందనలు అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed