మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ఘాటు ముద్దు ఫొటో వైరల్.. ప్రైవేట్ పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఇద్దరు!

by Disha Web Desk 6 |
మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ఘాటు ముద్దు ఫొటో వైరల్.. ప్రైవేట్ పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఇద్దరు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇటీవల మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ దీపావళి సందర్భంగా తమ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టాప్ స్టార్స్ కుటుంబాలతో పాటు హాజరయ్యారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ తో పాటు పలువురు దీపావళి పార్టీలో సందడి చేశారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి మంచు లక్ష్మి సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తాజాగా, మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో పార్టీకి సంబంధించిన పలు ఫొటోలను షేర్ చేసింది. ఈ పార్టీలో మంచు లక్ష్మిని అల్లు శిరీష్ ముద్దాడాడు. ఆమె బుగ్గపై ఘాటు ముద్దు పెట్టాడు. ఈ ఫోటో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. అయితే అది పార్టీ కల్చర్ లో భాగమైనప్పటికీ పెళ్ళైన మంచు లక్ష్మికి బ్యాచిలర్ ఆ రేంజ్ లో ముద్దాడటం చర్చకు దారి తీసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా అల్లు శిరీష్ విషయానికి వస్తే సక్సెస్ కోసం పోరాడుతున్నాడు. భారీ బ్యాగ్రౌండ్ ఉండి కూడా బ్రేక్ రావడం లేదు. అల్లు శిరీష్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయినా కానీ సూపర్ హిట్‌ను అందుకోలేక పోతున్నాడు. ఇది అల్లు శిరీష్ ని వేధిస్తున్న పరిణామం. ఆయన గత చిత్రం ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు శిరీష్ ఏ కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇక మంచు లక్ష్మి సినిమా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మోహన్ బాబు కూతురిగా కాకుండా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్లాన్‌లో ఉంది.


Next Story