- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఏం జరుగుతుందో తెలీదు.. భయంలో ప్రజలు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నోరా వీడియో
అక్కడి భయంకరమైన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi) ప్రస్తుతం మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ, తన క్షేమ సమాచారాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆమె దుబాయ్లో నివసిస్తున్నప్పటికీ, ప్రస్తుతం తాను ఇండియాలోనే ఉన్నానని, సురక్షితంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నోరా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు, అక్కడి భయంకరమైన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాలకు దూరంగా, ప్రస్తుతం తాను భారతదేశంలోనే ఉన్నానని ఆమె తన ఫాలోవర్లకు క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఆందోళన చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ప్రతిరోజూ ప్రజలు రేపు ఏం జరుగుతుందో అనే భయంతో బతుకుతున్నారు. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది.
అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఎవరూ కోరుకోరు. ఇప్పటికే మనం చాలా నష్టపోయాం’’ అని ఆమె పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూల అల్లర్లు, యుద్ధాలు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. వరుసగా జరుగుతున్న ఈ దారుణ సంఘటనలు ప్రజలను మానసికంగా కుంగదీస్తున్నాయని నోరా అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, అక్కడ నివసించే సెలబ్రిటీల క్షేమం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెరీర్ పరంగా దుబాయ్లో ఎక్కువగా ఉండే నోరా ఫతేహి గురించి సోషల్ మీడియాలో చర్చ నడిచింది. దీనికి స్పందిస్తూ, తాను క్షేమంగా ఉన్నానని చెబుతూనే, యుద్ధం వల్ల కలిగే నష్టం గురించి చెప్పడంతో ఆ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. మానవత్వం దృష్ట్యా శాంతి నెలకొనాలని, ఇలాంటి అల్లర్లు ఆగిపోవాలని ఆమె కోరుకున్నారు. నిరంతరం ఏదో ఒక సంక్షోభం తలెత్తడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారని ఆమె తన పోస్ట్తో స్పష్టం చేశారు.






