‘BRO’ సినిమాలో ఏపీ సీఎంను టార్గెట్ చేసిన Pawan Kalyan..! వైరల్ అవుతున్న మూవీ క్లిప్స్

by Disha Web Desk 7 |
‘BRO’ సినిమాలో ఏపీ సీఎంను టార్గెట్ చేసిన Pawan Kalyan..! వైరల్ అవుతున్న మూవీ క్లిప్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో దుమ్మురేపుతూనే.. మరోవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై-28న రిలీజై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేసి పంచులు వేశారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..?

ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్.. ‘ఈ లోకంలో మనం ఒంటరిగా వస్తాము ఒంటరిగానే పోతాము. అంతా నాదకున్న వాళ్లకు చివరకు మిగిలేది ఏమీ ఉండదంటూ’ చెప్తారు. అయితే ఈ డైలాగ్‌లు సీఎం జగన్‌ను టార్గెట్ చేసే ఉన్నాయని టాక్. అంతే కాకుండా ఇంటర్వెల్ తర్వాత ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో చేసిన డాన్స్ మోమెంట్స్‌ను పృథ్వీ రాజ్ ఇమిటేట్ చేశారు. దీంతో ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘‘పాపం.. మరి ఇంత డైరెక్ట్‌గా ట్రోల్ చేశాడేంటి’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి.. Sai Rajesh ఎమోషనల్ పోస్ట్..


Next Story