- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పవన్ కల్యాణ్ BRO సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక ఖరారు!
దిశ, వెబ్డెస్క్: పవర్ స్టార్ పవర్ కల్యాణ్-సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదికను చిత్ర బృందం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండటంతో నిర్మాతలు కూడా ఆయనకు అనుకూలంగా ఉండే రాజమండ్రిలో నిర్వహించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈనెల 25వ తేదీన ఈ ఫంక్షన్ జరుగనున్నట్లు సమాచారం. ఇద్దరు మెగా హీరోలైన పవర్ స్టార్, సాయితేజ్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ ఫంక్షన్ను పలువరు మెగా హీరోలు హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.