పవిత్ర.. రాజేంద్రప్రసాద్ మరదలా..? తెరపైకి కొత్త రిలేషన్!

by Disha Web Desk 7 |
పవిత్ర.. రాజేంద్రప్రసాద్ మరదలా..? తెరపైకి కొత్త రిలేషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వినిపించే పేర్లు పవిత్ర-నరేష్. ఈ జంటకు సంబంధించి ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా.. మరోసారి ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పవిత్ర.. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు మరదలు అవుతుందా..? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే..?

నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘అన్ని మంచి శకునములే’. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించగా.. దీనికి రాజేంద్రప్రసాద్, నరేష్, పవిత్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మా నరేష్ నిత్య పెళ్లి కొడుకు. ఆడు మామూలు కత్తి కాదు. వాడి కత్తిని మేము వాడలేం’’ అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తూనే కౌంటర్ ఇచ్చారు. అనంతరం నరేష్ నా తమ్ముడు అంటూ దగ్గరికి పిలుచుకుని చూశారా పెళ్లి కొడుకులా ఉన్నాడుగా అని అన్నారు. దానికి నరేష్ స్పందిస్తూ అవును నేను నిత్య పెళ్లి కొడుకునే అని చమత్కరించాడు. అయితే ఇక్కడ వరకు జరిగిన సన్నివేశం అంతా కామెడీగా అనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనిని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. ‘‘నరేష్ మీ తమ్ముడు అయితే పవిత్ర మీకు మరదలు అవుతుందా..?’’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read..

Priyanka: రహస్యంగా అతన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి!



Next Story