మూడేళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద షారుఖ్ మార్క్

by Disha Web Desk 12 |
మూడేళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద షారుఖ్ మార్క్
X

దిశ, వెబ్‌డెస్క్:చాలా కాలం తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తుంది. హాలీడే రోజు కాకుండా.. వర్కింగ్ డే అయిన బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి వసూళ్ల వేటలో షారుఖ్ సినిమా దూసుకుపోతుంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడ్వాన్స్‌ బుకింగ్‌తోనే దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 50 కోట్లు (నెట్) వసూలు చేసి KGF 2 హిందీ (2022), వార్ (2019) మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి లాంగ్ వికెండ్‌లో ఈ పఠాన్ భారీ వసూళ్లును రాబట్టే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read....

MM కీరవాణికి పద్మశ్రీ అవార్డు



Next Story