‘ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో NTR ఎమోషనల్.. ఆస్కార్‌పై కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
‘ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో NTR ఎమోషనల్.. ఆస్కార్‌పై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ మూవీ మార్చి 22న ఉగాది రోజు విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ పంక్షన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడానికి భారత సినీ అభిమానులతో పాటు తెలుగు ఫ్యాన్స్ ప్రధాన కారణమని అన్నారు. ఆస్కార్ వేదికపై తాను కీరవాణి, చంద్రబోస్‌లను చూడలేదని, ఇద్దరు భారతీయులను చూశానని ఎమోషనల్ అయ్యారు. తెలుగు వ్యక్తులు ఆస్కార్ వేదికమీద కనిపించడంతో ప్రపంచ వేదికమీద తెలుగుదనం ఉట్టిపడిందని అన్నారు. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ఇకపై భారతీయ సినిమాలు ఆస్కార్ వేదికమీద మెరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

అమిత్ షాతో రామ్ చరణ్, చిరంజీవి భేటీ.. సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

Next Story