నిత్యా మీనన్ ‘కుమారి శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్ ఏంటంటే

by Disha Web Desk 10 |
నిత్యా మీనన్ ‘కుమారి శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్ ఏంటంటే
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్న తాజా వెబ్‌ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇదెలా ఉందంటే.. ‘నా పేరు కుమారి ఇటికెలపూడి శ్రీమతి.. నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అంటూ నిత్యమీనన్ చెప్పే డైలాగ్‍తో ట్రైలర్ స్టార్టవుతుంది. ఇందులో ‘కార్తీక దీపం’ సీరియల్‍ ఫేమ్ డాక్టర్ బాబు నిరుపమ్ నిత్యకి ఫ్రెండ్ రోల్ పోషించాడు. ఇద్దరి మధ్య సంభాషణ కూడా బాగుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే తన తాతల కాలం నాటి ఇంటి కోసం నిత్యా మీనన్ కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఆ ఇల్లు సొంతం అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదనే పట్టుదలతో ఉంటుంది. అయితే ఆ ఇంటిని దక్కించుకోవడానికి కోర్టు‌లో ఆరు నెలల్లో రూ.38 లక్షలు నిత్య కట్టాల్సి ఉంటుంది. దీంతో ఆ డబ్బు‌కోసం బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. కానీ అందరూ ఆమెను వ్యతిరేకిస్తారు. అప్పటికే క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది శ్రీమతి. తల్లి పాత్రలో నటి గౌతమి కూడా బాగా ఆకట్టుకుంది. ఇక “అబ్దుల్ కలాం.. రజినీకాంత్.. ఇటికెలపూడి శ్రీమతి” అని కుమారి శ్రీమతి డైలాగ్స్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ముగిసింది.



Next Story

Most Viewed