స్టార్ యాక్టర్ VaraLakshmi SarathKumar కు NIA బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు!

by Satheesh |   (  Updated:2023-08-29 15:18:25  IST  )

స్టార్ యాక్టర్ వరలక్ష్మికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బిగ్ షాకిచ్చింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నటికి ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది.

స్టార్ యాక్టర్ VaraLakshmi SarathKumar కు NIA బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాక్టర్ వరలక్ష్మికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బిగ్ షాకిచ్చింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నటికి ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. కాగా, గతంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ వద్ద పీఏగా పని చేసిన ఆదిలింగం కేరళలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బులను ఆదిలింగం సినిమాల్లో ప్రొడ్యూస్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇప్పటికే ఆదిలింగాన్ని విచారించిన ఎన్ఐఏ.. తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటి శరత్ కుమార్ సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నటి శరత్ కుమార్‌కు ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : Krishna Shroff: చిరిగిన దుస్తులు ధరించి షాక్ ఇచ్చిన స్టార్ హీరో సోదరి.. కుర్రాళ్ల చూపంతా ఆ పచ్చబొట్లమీదే

Next Story