‘ఈగల్’ను ఓటీటీలో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. థియేటర్‌కి డిజిటల్‌కి మార్పు ఏంటంటే..?

by Disha Web Desk 7 |
‘ఈగల్’ను ఓటీటీలో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. థియేటర్‌కి డిజిటల్‌కి మార్పు ఏంటంటే..?
X

దిశ, సినిమా: మాస్ మహారాజా తాజా సినిమా ‘ఈగల్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటించారు. అక్రమ ఆయుధాల కట్టడికి హీరో చేసే పోరాటమే సినిమా కథ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి-9 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. ఇందులో ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ లుక్ కనిపించి ఆకట్టుకున్నాడు రవితేజ.

‘ఈగల్’ కు పోటీగా మరి ఏ ఇతర సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి ప్లెస్ పాయింట్ అయింది. దీంతో టాక్ విషయం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం బాగానే వసూలు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. అయితే.. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ తర్వాత ‘ఈగల్ పార్ట్ 2’ గురించి కూడా అప్ డేట్ ఇచ్చారు. ‘ఈగల్-2 యుద్ధకాండ’ అనే టైటిల్‌తో సినిమా ముగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఇక థియేటర్‌లోకి ఓటీటీకి ఓ తేడా కనిపెట్టారు మూవీ చూసినవాళ్లు. థియేటర్‌లో క్లైమాక్స్ అప్పుడు ‘ఈగల్-2 యుద్ధకాండ’ అని ముగించగా.. ఓటీటీలో మాత్రం పార్ట్ 2 ఉన్నట్లు జస్ట్ హింట్ ఇచ్చారు అంతే. యుద్ధకాండ అనేది తీసేశారు. దీంతో ‘ఈగల్ పార్ట్ 2’ పై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Read More..

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఆహా’ ఈజ్ బ్యాక్.. పోస్ట్ వైరల్

Next Story

Most Viewed