- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వయనాడ్ బాధితులకు అండగా నయన్, విఘ్నేష్..భారీ విరాళం అందజేత!
స్టార్ హీరోయిన్ నయనతార, తన భర్త తమిళ దర్శకుడు వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు. కేరళలోని కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా స్థానికులు చనిపోయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ నయనతార, తన భర్త తమిళ దర్శకుడు వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు. కేరళలోని కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా స్థానికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన చాలా మందిని కలిచి వేస్తోంది. దీంతో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తమకు తోచిన ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విఘ్నేష్ శివన్,నయనతార కూడా వారికి ఆర్థిక సహాయం అందించారు. విఘ్నేష్ తన భార్యతో కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కాగా ఆ సంస్థతరఫున, వయానాడ్ బాధితులు ఆర్థిక సహాయంగా, కేరళ రిలీఫ్ ఫండ్కు విరాళమిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు.
ఆయన తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. వయానాడ్లో కొండ చెరియలు విరిగి పడిన ఘటన మా మనసును కలిచి వేస్తుంది. అక్కడి కుటుంబాల బాధను చూస్తే తట్టుకోలేనంత బాధగా ఉంది. మా మనసులు ఆ కుటుంబాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాయి. అందుకే మా వంతు సాయంగా, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు , నా వంతు సాయంగా, రూ.20 లక్షలు అందిస్తున్నాను అని తెలిపాడు.






