పిల్లలు కంటే Nayanthara చనిపోతుందా.. Vignesh నిర్ణయం ఇదే?

by Dishanational2 |
పిల్లలు కంటే Nayanthara చనిపోతుందా.. Vignesh నిర్ణయం ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి.. ఆ పాత్రకే ప్రాణం పోస్తుంది. అలా తన నటనతో మెప్పించి, ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. తాజాగా నయనతారకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.




ఈ అమ్మడు ఇటీవల విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు పెళ్లి చేసుకునే సమయంలో ఒక ఒప్పదం కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఏ అమ్మాయి అయినా సరే పెళ్లైన తర్వాత అమ్మకావాలనే కోరిక ఉంటుంది. కానీ నయన్ విషయంలో అలా జరగదంట. తన గర్భసంచి చాలా బలహీనంగా ఉండటంతో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒక వేళ నయనతార పిల్లల్ని కనాలి అనుకుంటే అది తన ప్రాణానికే ముప్పంట.

దీనిపై ఓ నిర్ణయానికి వచ్చిన ఈ జంట ఓ అనాధ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నయనతార సరోగసి ద్వారా కావాలని కోరుకున్నా దానికి విఘ్నేష్ ఏ మాత్రం అంగీకరించలేదంట. దీనిపై అధికారిక ప్రకటన మాత్రంలేదు. కొంతమంది ఇవి గాసిప్స్ అంటున్నా మరికొందరు నిజమెనేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఎమైనా దీనిపై క్లారిటీ రావాలంటే తప్పనిసరిగా నయన్ స్పందించాల్సిందే అంటున్నారు అభిమానులు

Also Read : Arjun Kapoor: సోదరి మాతృత్వంపై హీరో ఎమోషనల్ నోట్.. నమ్మలేకపోతున్నానంటూ

Next Story