కవల పిల్లలతో మొదటిసారి దర్శనమిచ్చిన స్టార్ కపుల్స్

by Disha Web Desk 7 |
కవల పిల్లలతో మొదటిసారి దర్శనమిచ్చిన స్టార్ కపుల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయన తార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇద్దరూ ప్రేమించుకుని గతేడాది పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక పెళ్లి జరిగిన కొన్ని నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు ఈ జంట. ఇక అప్పటి నుంచి విఘ్నేష్, నయన్‌లు అటూ సినిమాలు చేస్తూనే.. ఇటూ ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. కాగా.. పిల్లలు పుట్టినప్పుడు కూడా కాళ్లు తప్ప ఫేస్ చూపించలేదు ఈ జంట. కానీ, ఎప్పుడో ఒక రోజు కచ్చితంగా కెమేరాకు చిక్కాల్సిందే కదా. తాజాగా.. నయన్ విగ్నేష్ దంపతులు తమ కవల పిల్లలను తీసుకుని ముంబై ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారు. దీంతో మీడియా వాళ్లు కెమెరాలకు పని చెప్పారు. దంపతులు ఇద్దరూ చెరో బాబుని ఎత్తుకుని కారులో నుంచి దిగుతూ కంగారుగా ఎయిర్ పోర్ట్‌లోకి వెళిపోయారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed