ప్రేక్షకులే నెపోటిజాన్ని పెంచి పోషిస్తున్నారు: నాని

by Disha Web Desk 6 |
ప్రేక్షకులే నెపోటిజాన్ని పెంచి పోషిస్తున్నారు: నాని
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో నెపోటిజం వివాదాస్పద టాపిక్‌గా మారింది. దీని కారణంగా ఇండస్ట్రీలో రకరకలా గొడవలు జరుగుతున్నాయి. అయితే తాజాగా 'నిజం విత్ స్మిత' షోలో పాల్గొన్న నటులు నాని, దగ్గుబాటి రానా నెపోటిజం గురించి డిష్కస్ చేశారు.

ఈ మేరకు నాని మాట్లాడుతూ 'అసలు నెపోటిజం పెంచి పోషిస్తుంది ప్రేక్షకులే. నా మొదటి మూవీ లక్షల్లో చూస్తే, రామ్‌చరణ్ మొదటి మూవీ కోట్లలో చూశారు. ఆ లెక్కన తీసుకుంటే నెపోటిజంను ప్రోత్సహిస్తుంది జనాలే కదా' అని అన్నాడు. తర్వాత రానా స్పందిస్తూ.. 'తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యత పిల్లల మీద ఉంటుంది. వారిని మరో స్థాయికి తీసుకెళ్లాలి. అప్పుడే పిల్లలు విజయం సాధించినట్లు' అని చెప్పుకొచ్చాడు.ఈ మధ్య కాలంలో నెపోటిజం వివాదాస్పద టాపిక్‌గా మారింది. దీని కారణంగా ఇండస్ట్రీలో రకరకలా గొడవలు జరుగుతున్నాయి.

Next Story

Most Viewed