Sitara చేసిన పనికి ధన్యవాదాలు చెబుతూ Namrata ఎమోషనల్ పోస్ట్..

by Disha Web Desk 6 |
Sitara చేసిన పనికి ధన్యవాదాలు చెబుతూ Namrata ఎమోషనల్ పోస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నమ్రత సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఇటివలే తన ముద్దుల కూతురు సితార బర్త్ డే వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్ విద్యార్థులతో కలిసి పంచుకున్న వీడియోను షేర్ చేసింది. అయితే మహేష్ బాబు స్వగ్రామమైన బుర్రిపాలెం జడ్పి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40 మంది బాలికలకు ఏంబీ ఫౌండేషన్ ద్వారా సైకిళ్లను అందించారు.

తాజాగా, నమ్రత ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపి కూతురికి థాంక్యూ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ ఈ 40 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. మీరంతా పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చదువును ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటివి అవసరం. మీ కళ్లతో సంతోషం తీసుకొచ్చిన సితారకు, మహేష్ బాబు ఫౌండేషన్‌ను ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం నమ్రత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు సితారపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: మరో అమ్మాయితో గెస్ట్ హౌజ్‌లో అడ్డంగా బుక్ అయిన రాజీవ్.. విడాకులు కావాలంటున్న సుమ?



Next Story

Most Viewed