కన్నీరుమున్నీరు అవుతున్న మహేశ్ బాబు భార్య, కూతురు.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
కన్నీరుమున్నీరు అవుతున్న మహేశ్ బాబు భార్య, కూతురు.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఘట్టమనేని మహేష్ బాబు ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. వారు గత ఏడేళ్లుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ చనిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న ప్లూటో (పెట్ డాగ్) మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, కూతురు సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు సితార తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘‘ఏడేళ్ల బంధం.. మిస్ యూ ప్లూటో’’ అంటూ షేర్ చేయగా.. దానికి స్పందించిన నమ్రత.. ‘‘ప్లూటో ఎక్కడికి వెళ్లదు.. మనతోనే, మన ప్రార్థనలో ఎప్పటికీ మనతోనే ఉంటుంది’’ అంటూ సితారకు ధైర్యం చెప్పింది. అంతే కాకుండా.. ఘట్టమనేని అభిమానులు సైతం ఆ పోస్ట్‌కు రిప్లైలు పెడుతున్నారు.

Next Story

Most Viewed