9 రోజులుగా ఆస్పత్రి బెడ్ పైనే యాక్టర్ మౌని రాయ్.. అసలేమైంది..?

by Disha Web Desk 12 |
9 రోజులుగా ఆస్పత్రి బెడ్ పైనే యాక్టర్ మౌని రాయ్.. అసలేమైంది..?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీవీ నటి, నాగిని సీరియల్ ద్వారా భారత టీవీ ప్రేక్షకులకు దగ్గరైన మౌని రాయ్ గత తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆప్ లోడ్ చేసిన ఆమె ఇలా రాశారు.. 9 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. నేను ఇప్పటివరకు తెలిసిన వాటి కంటే లోతైన నిశ్చలతతో నేను మునిగిపోయాను." అనారోగ్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను.. నేను ఇంటికి తిరిగి వచ్చాను. ప్రస్తుతం నేను మునపటి కంటే చాలా బాగున్నానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. క్లిష్టమైన పరిస్థితుల్లో నన్ను జాగ్రత్తగా చూసుకొని, విలువైన సమయాన్ని వెచ్చించిన నా ప్రియమైన స్నేహితులకు చాలా ధన్యవాదాలు అన్ని రాసుకొచ్చింది. కాగా ఆమెకు ఏమైందో అనే అసలు కారణం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



Next Story

Most Viewed