మైత్రి బ్యానర్‌లో మౌళి సినిమా.. ఊరమాస్ టైటిల్ ఖరారు.. హిట్ ఇచ్చేనా?

by Mallepaka Hamsa |

మౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

మైత్రి బ్యానర్‌లో మౌళి సినిమా.. ఊరమాస్ టైటిల్ ఖరారు.. హిట్ ఇచ్చేనా?
X

దిశ, సినిమా: యూట్యూబ్ వీడియోల ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకుంటున్నాడు మౌళి. ఇక ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన '90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో మౌళి తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో ఆయన పండించిన కామెడీ, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 'లిటిల్ హార్ట్స్' అనే సినిమాతో హీరోగా పరిచయమై, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం మౌళికి హీరోగా మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలోనే మౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. యంగ్ హీరోకు ఇంత పెద్ద బ్యానర్‌లో అవకాశం రావడం విశేషమే. అయితే ఈ చిత్రానికి ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. గత కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్తలు నిజమే అని అంతా నమ్మేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ‘దొంగ నా కొడుక’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ వినడానికి చాలా వెరైటీగా, మాస్ స్టైల్‌లో ఉంది. గతంలో ఇలాంటి టైటిల్స్‌తో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకున్నాయి. అదే సెంటిమెంట్ మౌళికి కూడా కలిసొచ్చి, ఈ సినిమాతో ఆయన మరో భారీ హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్‌కు సంబంధించిన పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం మౌళి కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించడం ఖాయమనిపిస్తోంది.

Next Story