బాలయ్య ‘Bhagwant Kesari’ అప్డేట్‌ ఇచ్చిన మోక్షజ్ఞ.. స్పీకర్స్ పగిలిపోతాయంటూ ట్వీట్

by Disha Web Desk 6 |
బాలయ్య ‘Bhagwant Kesari’ అప్డేట్‌ ఇచ్చిన మోక్షజ్ఞ.. స్పీకర్స్ పగిలిపోతాయంటూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంండగా.. శ్రీ లీల బాలకృష్ణకు కూతురిగా నటిస్తోంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గరికపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. తాజాగా, నందమూరి మోక్షజ్ఞ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. వినాయక చవితికి గణ గణ గణేశా అంటూ సాగే సాంగ్‌ రాబోతుంది. ఈ విషయాన్ని మోక్షజ్ఞ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ‘‘భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ లోడింగ్..గణ గణ గణేశా..!! వినాయక చవితి నాడు స్పీకర్స్ పగిలిపోతాయ్’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.



Next Story

Most Viewed