అస్వస్థతకు గురైన ఎంఎం కీరవాణి.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో వైరల్

by Dishanational2 |
అస్వస్థతకు గురైన ఎంఎం కీరవాణి.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎం ఎం కీరవాణి ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇటీవల ప్రపంచ దేశాలు మాట్లాడుకునేలా త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ఆస్కార్ రావాలని మూవీ టీం చాలా ప్రయత్నం చేసిందంట.పాటకి ఆస్కార్ అవార్డు రావడం కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కూడా నిర్వహించారు.

ఇక చివరకు నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అవార్డ్ అందుకున్నారు. ఇక ఆతర్వాత వారు కొన్ని రోజులు అమెరికాలోనే ఉండి ఏంజాయ్ చేసి ఇటీవలే ఇండియాకు వచ్చారు.

ఈ క్రమంలో ఎం ఎం కీరవాణి చాలా అస్వస్థకు గురయ్యాడంట. దీంతో ఆసుపత్రికి వెళ్లి చెక్ చేసుకోగా, ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందంత. ఈ విషయం ఓ హిందీ మీడియా సంస్థతో నాకు కరోనా పాజిటివ్ అంటూ చెప్పుకొచ్చాడంట. దీంతో ఆయన అభిమానులందరూ కీరవాణి త్వరగా కోలుకోవాలంటూ చెప్పుకొస్తున్నారు.


Next Story