- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం
బాలీవుడ్ లెజెండరీ నటుడు శ్రీ ధర్మేంద్ర(Dharmendra) గారి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ లెజెండరీ నటుడు శ్రీ ధర్మేంద్ర(Dharmendra) గారి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర గారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ చిరంజీవి (Chiranjeevi)ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘శ్రీ ధర్మేంద్ర గారు కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మానవతావాది కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ ఆయన ప్రదర్శించే వినయం, ఆప్యాయత నా హృదయాన్ని లోతుగా తాకాయి.
ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను, వ్యక్తిగత క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియ మిత్రులు సన్నీ డియోల్, బాబీ డియోల్తో పాటు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు , ఆలోచనలు తోడుగా ఉంటాయి. ఆయన వారసత్వం కోట్లాది మంది హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఓం శాంతి " అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.






