పెళ్లి వేస్ట్.. లివింగ్ రిలేషన్‌లో ఉండటం బెటర్.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-18 15:04:55  IST  )

ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్నప్పుడు ఒకరి వల్ల మరొకరికి ఇబ్బంది కలగకూడదు. అందుకే పెళ్లి చేసుకోకుండా కేవలం రిలేషన్‌షిప్‌లో ఉండటమే మేలు

పెళ్లి వేస్ట్.. లివింగ్ రిలేషన్‌లో ఉండటం బెటర్.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పిస్తున్న యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గతేడాది ‘థగ్ లైఫ్’ వంటి భారీ చిత్రంలో నటించిన ఈ భామ, ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ‘సంబరాల ఏటిగట్టు’ అనే పీరియడ్ డ్రామాలో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత జీవితం, వివాహం గురించి వస్తున్న వార్తలపై ఐశ్వర్య క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా హీరోయిన్ల పెళ్లి గురించి రకరకాల పుకార్లు వస్తుంటాయి. అయితే ఐశ్వర్య లక్ష్మి మాత్రం ఈ విషయంలో చాలా భిన్నంగా స్పందించారు. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘నాకు జీవితాంతం తోడుగా ఉండే భాగస్వామి కావాలి, అది నిజమే. కానీ పెళ్లి అనే బంధంలోకి వెళ్లాలని లేదు.

ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్నప్పుడు ఒకరి వల్ల మరొకరికి ఇబ్బంది కలగకూడదు. అందుకే పెళ్లి చేసుకోకుండా కేవలం రిలేషన్‌షిప్‌లో ఉండటమే మేలు’’ అని ఆమె తన అభిప్రాయాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐశ్వర్య చేసిన ఈ లివ్-ఇన్ రిలేషన్ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి అనే వ్యవస్థపై ఆమెకు ఉన్న అభిప్రాయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పడం విశేషం. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది. రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆమె ఆశిస్తోంది.

Next Story