ఓటీటీలోకి వచ్చేసిన ‘మ్యాన్షన్ 24’.. స్ట్రీమింగ్ అయ్యేది అక్కడే..

by Disha Web Desk 7 |
ఓటీటీలోకి వచ్చేసిన ‘మ్యాన్షన్ 24’.. స్ట్రీమింగ్ అయ్యేది అక్కడే..
X

దిశ, వెబ్‌డెస్క్: వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మ్యాన్షన్ 24’. మిస్టరీ అండ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌కు ఓంకార్ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు.. సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చన జోయిస్, శ్రీమాన్, రావు రమేష్, అమర్ దీప్, నందు, అయ్యప్ప పి శర్మ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సీరిస్ ఈరోజు (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం థ్రిల్లింగ్ హారర్ వెబ్ సీరిస్ ‘మ్యార్షన్ 24’ చూసేయండి.

Next Story

Most Viewed