- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామాయణంలో సీతగా సాయి పల్లవి.. వారిపై సంచలన వ్యాఖ్యలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. రాముడిగా రణ్బీర్ కపూర్.. రావణుడిగా యశ్.. మండోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నారు. అయితే ఈ స్టార్ కాస్టింగ్పై జనాలు శాటిస్ఫైయింగ్గా లేనట్లుగా కనిపిస్తుంది

దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. రాముడిగా రణ్బీర్ కపూర్.. రావణుడిగా యశ్.. మండోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నారు. అయితే ఈ స్టార్ కాస్టింగ్పై జనాలు శాటిస్ఫైయింగ్గా లేనట్లుగా కనిపిస్తుంది. అంత అందంగా ఉన్న కాజల్ను పక్కనపెట్టుకుని రావణుడు సాయి పల్లవిని ఎత్తుకొస్తాడా అనే మీమ్స్ వస్తున్నాయి. బీఫ్ తినే వ్యక్తి రాముడిగా నటించడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
కశ్మీర్ పండిట్స్ను.. గోహత్య చేసే వారిని.. చంపడంలో ఎలాంటి డిఫరెన్స్ లేదనే కామెంట్స్ సాయి పల్లవిని ఇరకాటంలో పెట్టేశాయి. ఆవును గోమాతగా చూడలేని.. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని ఇలాంటి వ్యక్తికి సీతమ్మ రోల్ దక్కడమేంటని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సినిమాను చూడబోమని ఓపెన్గానే చెప్పేస్తున్నారు. ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటంటే.. యశ్ ఒక్కడే రావణుడిగా నటించడం.. అది కూడా ఒక విషయంలో నెగెటివ్ అవుతుందని.. యశ్ను తెరమీద చూసి రావణుడైనా సరే విజిల్స్ వేస్తారేమోననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.






