నమ్రత చెంప చెల్లుమనిపించిన మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 9 |
నమ్రత చెంప చెల్లుమనిపించిన మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ కపుల్స్‌గా పేరు సంపాదించుకున్నారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ అనే చిత్రంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపించి.. అనంతరం పెద్దల సమక్షంలో 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో చిక్కులు, చికాకులు, విడాకుల వరకు పోతున్న జంటల్ని ఎందరినో చూస్తున్నాం. కానీ, వీరి పెళ్లై దాదాపు 18 ఏళ్లైనా ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేకుండా సుఖసంతోషాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలున్నారు.

అయితే నమ్రత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు. ‘తను వెయిట్ తక్కువగా ఉండడం వల్ల గౌతమ్‌ కడుపులో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడిందట. ఆ సమయంలో నమ్రత మరింత డిప్రెషన్‌కు లోనై.. పదే పదే ఏడుస్తూ ఉండేదట. మహేశ్ బాబు ఎంత చెప్పినా ఆ మూడ్ నుంచి అస్సలు బయటకు రాలేదట. దీంతో మహేష్.. నమ్రత మనసు మార్చడానికి లాగి పెట్టి ఒక్కటి ఇచ్చారట. అది కూడా డాక్టర్ చెప్తేనే కొట్టారట. ఇక అప్పుడు ఆమె నార్మల్ మూడ్‌లోకి వచ్చిందట. ప్రెగ్నెంసి టైంలో నమ్రత పడిన ఇబ్బందుల గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Read More: చిన్న సినిమాగా వచ్చి భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సామజవరగమన’.. కలెక్షన్స్ మోత మోగిస్తోంది..



Next Story

Most Viewed