చిరంజీవి, బాలయ్యతో రొమాన్స్ చేయడమంటే ఇష్టం: ఖుష్బూ సుందర్

by Disha Web Desk 9 |
చిరంజీవి, బాలయ్యతో రొమాన్స్ చేయడమంటే ఇష్టం: ఖుష్బూ సుందర్
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఖుష్బూ ఇటీవలే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ చిత్రంలో నటించారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ప్రెస్ మీట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. అలాగే బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నా కలల హీరో.. ఇప్పటికీ నేను ఆయన పోస్టర్లు దాచిపెట్టుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా వారసుడు చిత్రంలో ఆమె 18 నిమిషాల సీన్లు తొలగించారని అందుకు తనకు బాధగా ఉందని వెల్లడించారు.

Also Read..

Aarti Mittal: వ్యభిచారం కేసులో నటి అరెస్ట్.. అపార్ట్‌మెంట్‌లోనే మిట్టల్ దందా

Next Story

Most Viewed