ఆమె కోసమే ఒంటరిగా ఉండిపోయా : జేడీ చక్రవర్తి

by Dishafeatures1 |
ఆమె కోసమే ఒంటరిగా ఉండిపోయా : జేడీ చక్రవర్తి
X

దిశ, సినిమా: ఒక్కప్పుడు టాలీవుడ్‌లో ‘గులాబీ’, ‘సత్య’, ‘బొంబాయి ప్రియుడు’, ‘మనీ మనీ’, ‘దెయ్యం’ వంటి సూపర్ హిట్ సినిమాలో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరో జేడీ చక్రవర్తి. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ కూడా ప్రారంభించి సినిమాలతో, పలు సిరీస్ లతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ హీరో వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చక్రవర్తి తాను ఇంకా పెళ్లి చేసుకోపోవడానికి గల కారణాలను బయటపెట్టారు.

నటుడు మాట్లాడుతూ.. ‘ఎంతో అందంగా ఉంటే కానీ హీరోయిన్స్ అవ్వరు. అందం అనేది చూసే కళ్ళలో ఉంటుంది. అలా ప్రతి హీరోయిన్ నచ్చేసింది. అయితే నచ్చడం వేరు ప్రేమించడం వేరు. శ్రీదేవి అంటే చాలా ఇష్టం. అయితే ‘గులాబీ’ సినిమా సమయంలో నా హృదయంలో గంటలు మోగాయి. నేను, కృష్ణ వంశీ ఇద్దరం ఒకే హీరోయిన్‌ను ప్రేమించాం. ఇప్పటికీ కొట్టుకుచస్తున్నాం. నాకు నచ్చే డైరెక్టర్లలో కృష్ణ వంశీ ఒకరు. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఇక ఈ లవ్‌లు నాకు వర్కౌట్ కావని తెలిసి నా కోసం మా అమ్మ వెతికి మరి ఓ అమ్మాయిని తీసుకువచ్చింది.

అప్పుడు మాది ఓ ఫ్లాట్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. అక్కడే ఆ అమ్మాయిని మీట్ అయ్యాను. ఇక నాతో మాట్లాడుతూ పెళ్లయ్యాక మీ మదర్ ఎక్కడ ఉంటుంది అడిగింది. నేను షాక్ అయ్యాను. అదేంటి నేను ఒక్కడినే కొడుకుని.. మళ్లీ ఇలా అడుగుతుందేంటి అని ఆశ్చర్యం వేసింది. అందరూ అలాగే ఉంటారని కాదు.. నాకు జరిగింది చెప్తున్నా. ఆ భయంతోనే ఒంటరిగా ఉండిపోవలసి వచ్చింది’ అని తెలిపారు జేడీ చక్రవర్తి.

Read More..

నితిన్ ఫ్యాన్స్‌కు పండుగే.. పవన్ కళ్యాణ్ టైటిల్‌తో వచ్చేసిన “తమ్ముడు”


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed