ఆ నాలుగేళ్లు నరకం అనుభవించాను.. నాకు ఎవరి సపోర్ట్ లేదు

by Dishanational2 |
ఆ నాలుగేళ్లు నరకం అనుభవించాను.. నాకు ఎవరి సపోర్ట్ లేదు
X

దిశ, సినిమా: కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కృతిసనన్‌ ఓపెన్ అయింది. ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్రలో నటిస్తున్న ఆమె.. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఇండియన్ సినీ పరిశ్రమ తన ప్రతిభను గుర్తించిందని చెప్పింది. ఈ మేరకు ఇండస్ట్రీలో తనకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కష్టపడి సొంతగా ఎదిగే ప్రయత్నాలు చేశానని, దీంతో మొదటి నాలుగు సంవత్సరాలు కష్టంగా గడచినట్లు తెలిపింది. ‘‘బరేలీ కి బర్ఫీ’ చిత్రంతో నా టాలెంట్ ఏమిటో అందరికీ తెలిసింది. లుకా చుప్పీ, మిమి చిత్రాలు నా కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చాయి. అప్పటినుంచి వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇన్నాళ్లకు నా కష్టానికి తగిన ఫలితం దక్కినట్లు అనిపిస్తోంది’ అని తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ప్రభాస్ సరసన ఆమె నటించిన ‘ఆదిపురుష్‌’ జూన్‌ 16న విడుదలకానుంది.

Read More: ఢిల్లీ మెట్రోలో నటికి లైంగిక వేధింపులు.. అబ్బాయిలు గుంపుగా దాడిచేశారట



Next Story