- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వాఘా బార్డర్లో స్వాతంత్ర్య సంబరాలు చేసుకున్న కియార.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కియారా అద్వాణీ భారత జవాన్లతో కలిసి సందడి చేసింది. ఆగస్టు 15 సంబరాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా తాజాగా సినిమా షూటింగ్లో కోసం వాఘా సరిహద్దుకు వెళ్లిన నటి మిలిటరీ బలగాలను కలిసి తన దేశభక్తిని చాటుకుంది. ఈ మేరకు జవాన్లతో చాలాసేపు గడిపి పలు విషయాలపై చర్చించిన ఆమె తన వంతుగా బార్డర్లో ఓ మొక్కను నాటడంతోపాటు జాతీయ జెండాను చేతబట్టి జవాన్లతో కలిసి ఫొటోలు దిగింది. అంతేకాదు వీటిని నెట్టింట షేర్ చేస్తూ.. ‘కియారా అద్వాణీ జెండాతో ఎంత ముద్దుగా ఉంది. ఈరోజు అమృత్సర్లో’ అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె దేశ భక్తిని మెచ్చుకుంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. చివరగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ అమృతసర్లో జరుగుతుండగా ఈ క్రమంలోనే దగ్గర్లోని వాఘా బార్డర్కు వెళ్లి మిలిటరీ బలగాలను కలిసినట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
Read More: Don3 నుంచి అనౌన్స్మెంట్ వీడియో.. రణ్వీర్ డైలాగ్ వింటే గూస్బంప్సే!