శ్రీవారి సన్నిధిలో 'Karthikeya 2' మూవీ యూనిట్..

by Disha Web Desk 6 |
శ్రీవారి సన్నిధిలో Karthikeya 2 మూవీ యూనిట్..
X

దిశ, సినిమా: నిఖిల్‌-అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లోను ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్‌లో విడుదలైన సినిమా ప్రస్తుతం 1000 థియేటర్స్‌లలో సక్సె‌స్‌ఫుల్‌గా రన్ అవుతూ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఈమూవీ సక్సెస్‌ నేపథ్యంలో నేడు 'కార్తికేయ 2' టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిఖిల్‌తో పాటు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్, డైరెక్టర్‌ చందు మొండేటి, ఇతర టీం సభ్యులు మొక్కలు చెల్లించుకున్నారు.

Next Story

Most Viewed