మీరంతా 'కాంతారా' పార్ట్ 2' చూశారు. పార్ట్ 1 రాబోతుంది: షాక్ ఇచ్చిన రిషబ్

by Disha Web Desk 10 |
మీరంతా కాంతారా పార్ట్ 2 చూశారు. పార్ట్ 1 రాబోతుంది: షాక్ ఇచ్చిన రిషబ్
X

దిశ, సినిమా: గతేడాది రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రాల్లో 'కాంతారా' ఒకటి. బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ.450 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఈ మధ్యే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. ఇందులో భాగంగా హీరో రిషబ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రిఫర్ మాట్లాడుతూ ''కాంతారా' సినిమాను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకెంతో ఆనందంగా ఉంది. దేవుని ఆశీస్సులతో ఈ మూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. వాస్తవానికి మీరు చూసింది పార్ట్ 2. వచ్చే ఏడాది పార్ట్ 1 తీసుకొస్తా. ఈ ప్రీక్వెల్ ఆలోచన మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడే వచ్చింది. ఎందుకంటే మూవీ చరిత్ర చాలా లోతైనది. ప్రస్తుతం కథ కోసం ఇంకా డెప్త్‌గా తెలుసుకుంటున్నాం. మా రీసెర్చ్ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఎక్కువ ఏమీ చెప్పలేను. ప్రొడ్యూసర్స్ గతంలో సీక్వెల్ తీసుకొస్తున్నట్టు చెప్పారు. కానీ, ఇప్పుడు ప్రీక్వెల్ అని తేలింది' అని రిషబ్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి : Rashmika Mandanna :చర్మ వ్యాధితో బాధపడుతున్న రష్మిక.. పోస్ట్ వైరల్

Next Story

Most Viewed