Jeevitha Rajasekhar కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి..

by Disha Web Desk 19 |
Jeevitha Rajasekhar కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి..
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్టర్ జీవితరాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ నమ్మించి.. లక్షన్నర కాజేశారు. తెలిసిన వారి పేరు చెప్పే జీవితరాజశేఖర్‌కు టోకరా పెట్టారు. సైబర్ నేరగాడు తమకు తెలిసిన వారి పేరే చెప్పడంతో నిజమని నమ్మిన జీవితా మేనేజర్ లక్షన్నర బదిలీ చేశాడు. డబ్బులు చెల్లించినా తర్వాత నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయామని గ్రహించినా మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు చెన్నైకి చెందిన నరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు నరేష్ గతంలో కూడా నటీనటులతో పాటు పలువురు ప్రొడ్యూసర్స్‌ని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

READ MORE

Sudigali Sudheer 'Galodu ' నా కెరీర్‌ను మలుపుతిప్పింది : రవిరెడ్డి


Next Story

Most Viewed