- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Jayasudha: ఆ కారణంతోనే విశ్వనాథ్ నాతో సినిమా తీయలేదన్న.. జయసుధ
by Disha Web Desk 10 |
X
దిశ, సినిమా: దివంగత దర్శకుడు, నటుడు కే విశ్వనాథ్తో తనకున్న అనుబంధం గురించి నటి జయసుధ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'సాగర సంగమం' కోసం తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడంతో ఆయన సీరియస్ అయ్యారని, కొంతకాలం తనతో మాట్లాడలేదని చెప్పింది. 'చాలా మంది నటులు విశ్వనాథ్గారితో గొప్ప చిత్రాలు చేశారు. కానీ, నేను ఎందుకు చేయలేదనే డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. 'సాగర సంగమం' కోసం ఏడిద నాగేశ్వరరావు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ, కమల్ హాసన్ బిజీగా ఉండడంతో ఆ మూవీ ఆలస్యమైంది. అదే సమయంలో ఎన్టీఆర్తో నేను ఓ సినిమా చేయాల్సి వచ్చింది. వాళ్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయగా నాపై అలిగారు. అంతేకాదు నాతో సినిమాలు కూడా తీయలేదు. అయితే కొంతకాలానికి కోపం తగ్గించుకుని ఒక కథను చెప్పి నటించమని అడిగినా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు' అంటూ పలు విషయాలను గుర్తుచేసుకుంది.
Next Story