ఫేమస్ కావడానికి ఇలాంటి వార్తలు రాయడం బాధాకరం.. అనస్వర రాజన్ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చి ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యంగ్ సెన్సేషన్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan).

ఫేమస్ కావడానికి ఇలాంటి వార్తలు రాయడం బాధాకరం.. అనస్వర రాజన్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చి ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యంగ్ సెన్సేషన్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan). ‘విత్ లవ్’(With love) సినిమా ద్వారా అనస్వర మరోసారి తెలుగు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తోంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ స్వచ్ఛమైన ప్రేమకథలో అభిషన్ జీవింత్ (Abhishan Jeevinth)హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించగా, సురేష్ ప్రొడక్షన్స్ పంపిణీలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనస్వర పలు ఫన్నీ కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది.

షూటింగ్ సెట్‌లో తన సహనటుడు అభిషన్ జీవింత్‌తో కలిసి పనిచేసేటప్పుడు, ఆయనతో స్నేహం పెంచుకోవడానికి తాను మూగ దానిలా నటించానని అనస్వర సరదాగా చెప్పిన మాటలను వివాదాస్పదంగా చేస్తూ పలు వార్తలు రాస్తున్నారు. ఈక్రమంలో.. ఈ విషయంపై అనస్వర స్పందిస్తూ.. నవ్వుతూ చెప్పిన మాటల నుండి ఒకే ఒక్క లైన్ తీసుకుని దానిని భూతద్దంలో చూపించడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా తాను అన్న మాటలను వక్రీకరించి, అవి ఏదో అహంకారంతో చేసిన వ్యాఖ్యల్లా చిత్రించడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. కేవలం వెబ్‌సైట్లకు రీచ్ రావాలని లేదా వ్యూస్ పెంచుకోవాలని ఒక నటి గౌరవానికి భంగం కలిగించేలా వార్తలు రాయడం జర్నలిజం అనిపించుకోదని ఆమె ఘాటుగా విమర్శించారు.

సాధారణంగా తాను ఇటువంటి గాసిప్స్‌ను పట్టించుకోనని, కానీ ఈసారి తన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తుంటే మౌనంగా ఉండటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. "ఒక స్నేహపూర్వక వాతావరణంలో జోక్స్‌ వేసుకున్న మాటలను పట్టుకుని, వాటిని సీరియస్ స్టేట్‌మెంట్స్‌గా మార్చడం కరెక్ట్ కాదు. ఇది కేవలం ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే" అని ఆమె మండిపడ్డారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివిటీని సృష్టించడం వల్ల తనతో పాటు తన కుటుంబం కూడా ఎంతో మానసిక వేదనకు గురైందని ఆమె తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుగుతున్న క్రమంలో ఇటువంటి అడ్డంకులు సహజమే అయినప్పటికీ, బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు వాస్తవాలను గ్రహించి వార్తలు రాయాలని కోరింది.

Next Story