Guppedantha Manasu: రిషి నిజంగానే చనిపోయాడా?.. కొడుకు ఫొటోపై RIP చూసి షాక్ అయిన మహేంద్ర

by Disha Web Desk 10 |
Guppedantha Manasu: రిషి నిజంగానే చనిపోయాడా?.. కొడుకు ఫొటోపై RIP చూసి షాక్ అయిన మహేంద్ర
X

దిశ,సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

సార్ మీరు అబద్దం చెబుతున్నారు రిషి సార్ చనిపోయారు. సోషల్ మీడియా మొత్తం అదే నడుస్తోంది కావాలంటే రిషి ఫొటో మీద RIP అని రాసి ఉన్న ఫొటోని మహేంద్ర, ఫణేంద్రకు ఓ స్టూడెంట్ చూపిస్తారు. దాన్ని లాక్కుని చూస్తుంది అనుపమ. రిషి ఫొటోని అలా చూసి చాలా బాధ పడుతుంది. వెంటనే తను కూడా ఇది అబద్దం అని చెబుతుంది. మహేంద్ర అయితే.. అందరి మీద అరుస్తాడు కోపంగా. ‘రిషికి ఏం కాలేదు.. ఎక్కడున్నా క్షేమంగానేనే ఉంటాడని చెబుతాడు. ‘అయితే ఎక్కడున్నారో అందరికీ చెప్పండి’ అని లెక్చరర్స్ అడుగుతారు.

ఇక ఫణేంద్ర కూడా.. ‘అవన్నీ పుకార్లే.. మన ఋషికి ఏం కాదు.. తను ఎక్కడ ఉన్నా బాగానే ఉంటాడు.. త్వరలోనే మన అందరి దగ్గరికి వస్తాడు’ అని చెప్పడంతో.. స్టూడెంట్స్ కాస్త సద్దుమణుగుతాడు. మీ జీతాలు త్వరలోనే అందుతాయి అనడంతో లెక్చరర్స్ సైలెంట్ అవుతారు. అంతా చూసి శైలేంద్ర మాత్రం నవ్వుకుంటాడు. మహేంద్ర అల్లాడిపోతూ అక్కడి నుంచి వెళ్లగానే.. అనుపమ.. మహేంద్ర వెనుకే పరుగుతీస్తుంది. ఫణేంద్ర కూడా లోపలికి వెళ్లిపోతాడు. రిషి RIP ఫోటో చూసి దేవయాని, శైలేంద్రకు ఫోన్ చేసుంది శైలేంద్రకు. ‘ఏంటి నాన్నా ఈ ఘనకార్యం నీదేనా? నవ్వుతూ అంటుంది. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.

Next Story

Most Viewed