- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్-2’ ఇంటర్నేషనల్ స్వాగ్ అంటూ ఆకాశానికెత్తేసిన ఐకాన్ స్టార్!
దేశభక్తి స్వాగ్తో ఇప్పుడే ధురంధర్-2 చూశాను. ఈ సినిమా ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. థియేటర్లలో క్లాప్స్ కొట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

దిశ, సినిమా: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ‘ధురంధర్’ గత ఏడాది డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్గా వచ్చిన ‘ధురంధర్-2’ అంతకు మించిన రెస్పాన్స్తో దూసుకుపోతోంది. మార్చి 18న జరిగిన ప్రీమియర్ షో చూసిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకున్నారు. “దేశభక్తి స్వాగ్తో ఇప్పుడే ధురంధర్-2 చూశాను. ఈ సినిమా ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. థియేటర్లలో క్లాప్స్ కొట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాధవన్తో పాటు నటీనటులందరూ అద్భుతంగా నటించారు. రణ్వీర్ సింగ్ బ్రదర్.. నీలాంటి భిన్నమైన యాక్టర్ మన దేశంలో ఉండటం గర్వకారణం.
దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇంటర్నేషనల్ స్వాగ్తో తీసిన భారతీయ కథ ఇది. జై హింద్!” అంటూ సినిమాను ఆకాశానికెత్తేశారు. అయితే, ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య విడుదలై సందడి చేస్తోంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తన తోటి టాలీవుడ్ హీరో సినిమా గురించి కాకుండా, బాలీవుడ్ మూవీ ‘ధురంధర్-2’ చూసి రివ్యూ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రణ్వీర్ సింగ్ యాక్షన్, ఆదిత్య ధర్ మేకింగ్ వాల్యూస్ అల్లు అర్జున్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కేవలం బాలీవుడ్కే పరిమితం కాకుండా, సౌత్ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. సినీ సెలబ్రిటీలను ఫిదా అయ్యేలా చేస్తోంది.






