మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు కానీ.. భర్తపై యాంకర్ అనసూయ షాకింగ్ పోస్ట్

by Disha Web Desk 6 |
మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు కానీ.. భర్తపై యాంకర్ అనసూయ షాకింగ్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస చిత్రాల్లో ఆఫర్లు కొట్టేస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడాయాలో యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు అనసూయ భర్త పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్‌లో భాగంగా బ్యాంకాక్ వెళ్లారు.

తాజాగా, జూన్ 4న అనసూయ, భరద్వాజ్ వివాహ వార్షికోత్సవం కావడంతో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.“ప్రియమైన నిక్కూ.. ఇన్నాళ్లూ నాతో కలిసి ఉండటమే కాకుండా, ఎన్నో త్యాగాలు చేశారు. కొందరు మీపై ఎంతో నీచమైన కామెంట్స్ చేశారు. కానీ, మీరు వాటిని పట్టించుకోలేదు. మన ప్రేమ మందిరాన్ని ఎంతో అద్భుతంగా నిలబెట్టావు. అందుకు నీకు కృతజ్ఞతలు. నన్ను ఎంతో ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటున్నారు. మనం ఎంతో తెలివిగా ముందుకు సాగుతున్నాం. పైకి ఎదుగుతున్నాం. మీరు నన్ను ఇంతగా ప్రేమగా, ఇంత ఒపికగా ఎలా చూసుకుంటున్నారు? అని ఒక్కోసారి ఆశ్చర్యపోతాను. ఒక్కోసారి నేను కూడా కొన్ని విషయాల్లో నిన్ను వెనకేసుకుని వస్తున్నాను. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. కొంతమంది మన జీవితాన్ని చికాకు పెట్టాలని భావిస్తున్నా, పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాం. మనిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు. కానీ, కష్టసుఖాల్లో తోడుంటూ కలిసిపోతున్నాం. మన మధ్య ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఒకరికొకరం బలంగా ముందుకు సాగుతున్నాం. మన వివాహ బంధాన్ని డేటింగ్ లాగా ఉండేందుకు అనుమతించినందుకు ధన్యవాదాలు. హ్యాపీ యానివర్సరీ బేబీ. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.

Also Read: బర్రెకు బంగారం దొరికినట్టుంది.. అనసూయ భర్తపై దారుణంగా ట్రోల్స్

Next Story

Most Viewed