- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతత కోసమే వచ్చా.. తిరుమల దర్శనంపై మాళవిక ఆసక్తికర కామెంట్స్
నా జీవితంలో తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి వాతావరణం, స్వామివారి దర్శనం మనసుకి ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి.

దిశ, సినిమా: కోలీవుడ్ గ్లామర్ క్వీన్ మాళవిక మోహనన్ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ, తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వరుస షూటింగ్స్తో తీరిక లేకుండా గడుపుతున్న మాళవిక, కొంచెం గ్యాప్ దొరకడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం మీడియాతో ముచ్చటించారు. తిరుమల యాత్ర గురించి మాళవిక మాట్లాడుతూ.. "నా జీవితంలో తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి వాతావరణం, స్వామివారి దర్శనం మనసుకి ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి.
కుటుంబంతో కలిసి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది" అని తన అనుభూతిని పంచుకున్నారు. ప్రస్తుతం మాళవిక డైరీ సినిమాలతో నిండిపోయింది. తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి స్పందిస్తూ.. విజయ్ సేతుపతి సరసన 'పాకెట్ నావల్' (Pocket Naval), అలాగే కార్తీ హీరోగా వస్తున్న భారీ సీక్వెల్ 'సర్దార్-2' (Sardar 2) లో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని, అందుకే తాను చాలా బిజీగా గడుపుతున్నానని వెల్లడించారు. షూటింగ్స్ మధ్యలో దొరికిన ఈ విరామం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.






