ఆమెను తల్లిని చేసిన హైపర్ ఆది.. సుధీర్‌తో తిరగడం వల్లే అంతకు తెగించాడా?

by Disha Web Desk 6 |
ఆమెను తల్లిని చేసిన హైపర్ ఆది.. సుధీర్‌తో తిరగడం వల్లే అంతకు తెగించాడా?
X

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అందరికీ సుపరిచితమే. ఆయన పలు స్కిట్స్ చేసి జనాల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్, అదిరిపోయే పంచులతో జనాల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. బుల్లితెరపైనే కాకుండా పలు సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుని తన సత్తా చూపించాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్‌లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, హైపర్ ఆది ఓ మహిళను తల్లిని చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షో లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయం బయటపడింది.

అసలు విషయంలోకి వెళితే.. హోలీ స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా హైపర్ ఆది, రష్మి కలిసి కొన్ని కామెంట్స్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రష్మి మీ పేరు కొట్టగానే గూగుల్ మీరు ఎలాంటి వారో చెప్తుంది. ఆ తర్వాత ఫోన్ తీసి హైపర్ ఆది ఎలాంటి వాడు అని అడుగుతుంది. దానికి.. నన్ను అందరూ గూగుల్ తల్లి అని అంటారు.

కానీ నన్ను తల్లిని చేసిందే వాడు అంటూ ఫోన్‌లో నుంచి ఓ మహిళ వాయిస్ వస్తుంది. దీంతో అంతా పగలబడి నవ్వుతూ హైపర్ ఆది వైపు చూస్తారు. ఆ తర్వాత యాంకర్ రష్మి గూగుల్ తల్లినే తల్లిని చేశావా? అని అడుగుతుంది. దానికి ఆది నవ్వి.. నేను ఒక్కడితో తిరిగేవాడిని.. మీ వాడే వాడు.. వాడి వల్లే ఇదంతా అని సుడిగాలి సుధీర్‌ను ఇరికిస్తాడు. దానికి రష్మి సైలెంట్‌గా ఉండిపోతుంది. వెంటనే ఆది స్టేజి పైకి వెళ్లి గూగుల్ తల్లిని ఇంద్రజ గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె ఇప్పుడే ఇలా ఉన్నారంటే.. ఆ వయస్సులో చించేసింది కావొచ్చు అని అంటుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొట్టడంతో అది చూసిన నెటిజన్లు సుధీర్‌తో తిరగడం వల్ల అంతకు తెగించాడా? అని అంటున్నారు.

Read More..

జబర్దస్త్ వర్షకు షాకిచ్చిన ఇమ్మానుయేల్ .. తన గర్ల్‌ఫ్రెండ్‌ను స్టేజీ పైకి తీసుకొచ్చి అసలు విషయం చెప్పేశాడుగా!



Next Story