ఇదొక ప్రశ్ననా.. సురేష్ కొండేటిపై హీరోయిన్ ఫైర్

by Disha Web Desk 7 |
ఇదొక ప్రశ్ననా.. సురేష్ కొండేటిపై హీరోయిన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మాన్షన్ 24’. సత్యరాజ్ కీ రోల్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్, టీజర్, ట్రైలర్ చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక విడుదల సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఇక రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే.. ఎప్పటిలాగే ఈ ప్రెస్ మీట్‌లో కూడా వింత ప్రశ్న అడిగా వార్తల్లో నిలిచాడు జర్నలిస్ట్ సురేష్ కొండేటి. ఇంటరాక్షన్‌లో భాగంగా.. మీరు దెయ్యాలను నమ్ముతారా అని వరలక్ష్మి శరత్ కుమార్‌ని ప్రశ్నించాడు సురేష్. దాని ఆమె నమ్ముతాను అంటూ బదులిచ్చింది. తర్వాత దెయ్యాన్ని ఇష్టపడతారా..? అని మరో ప్రశ్న వేశాడు సురేష్. దీనికి కోపం వచ్చిన వరలక్ష్మి.. ‘‘దెయ్యాలను ఎవరైనా ఇష్టపడతారా.. అసలు ఇదొక ప్రశ్ననా’’ అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది.

అనంతరం మీ దర్శకుడికి దెయ్యాలు అంటే ఇష్టం అందుకే ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ ఓంకార్‌కు చురకలు అంటించే ప్రయత్నం చేశాడు సురేష్. దీనిపై స్పందించిన ఓంకార్.. ‘నేనెప్పుడూ అలా చెప్పాను సార్. అన్నీ మీకు మీరే అనుకుంటే ఎలా. నేను చెప్పానా దెయ్యం అంటే నాకిష్టమని’ అంటూ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. నువ్వు ఇక మారవా.. ఎప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలే వేస్తావా అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed